యేసుక్రీస్తు మనకు ఆయన స్వంత శరీరము మరియు రక్తం ద్వారా మనకు నిత్యజీవాన్ని ప్రసాదించాడు
సంఘము యేసు క్రీస్తు ఆదేశించిన రెండు ఆజ్ఞలను అనుసరిస్తుంది. ఒకటి బాప్తిస్మము మరియు మరొకటి పవిత్ర ప్రభువు బల్ల. ఈ సువార్త జ్ఞాపకార్థం, దాని రొట్టె మరియు ద్రాక్ష రసము ద్వారా వెల్లడి చేయబడిన సత్యం యొక్క సువార్తపై ధ్యానం చేయుటకు మేము ప్రభువు బల్లలో పాల్గొంటాము.
పవిత్ర ప్రభువుబల్ల ఆచరణలో, మేము యేసు శరీరానికి జ్ఞాపకార్థంగా రొట్టెను తీసుకుంటాము మరియు ఆయన రక్తానికి జ్ఞాపకార్థంగా ద్రాక్షారసము త్రాగుతాము. అలాగే, పవిత్ర ప్రభువు బల్ల యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, యేసు మనలను లోక పాపాల నుండి రక్షించాడని మరియు ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణం ద్వారా మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడనే సత్యంపై మన విశ్వాసాన్ని బలోపేతం చేయడం.
అయితే, సమస్య ఏమిటంటే, దాదాపు అందరు క్రైస్తవులు పవిత్ర ప్రభువు బల్లలో అధికారికంగా మాత్రమే పాల్గొంటారు, “నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.” (యోహాను 6:55) అనే మాటకు యేసు ఉద్దేశ్యం ఏమిటో కూడా గ్రహించకుండానే పాల్గొంటున్నారు. కాబట్టి, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో, ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగమని యేసు ఇచ్చిన ఆజ్ఞ యొక్క అర్థంపై మనం మరోసారి దృష్టి పెట్టాలి మరియు దానిని విశ్వసించాలి.