శరీరం వ్యాధి మందిరం అనే మాట అనాదిగా వినిపిస్తున్నదే. ' శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ' ప్రతి వ్యక్తికి శరీరాన్ని రక్షించుకోవడం ముఖ్య కర్తవ్యం. బంగారం తినగలిగిన కొటీశ్వరుడయినా ఆరోగ్యం లేక పోయిన తర్వాత అతనంత దరిద్రుణ్ణి ఊహించలేం. మిడాన్ రాజు కథ అందుకు చక్కటి ఉదాహరణ.మానవుని అమూల్యమైన సొత్తు జీవం. దాని తర్వాత విలువైంది ఆరోగ్యం. మన భారత దేశం వైద్యానికి పుట్టినిల్లయితే పాశ్చాత్య దేశాలు మెట్టినిల్లులలాంటిది. అతి ప్రాచీన కాలంలోనే యోగ దృష్టితో సాధించి సూత్ర రూపంగా చెప్పిన వైద్య పరమయిన అంశాలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ప్రకృతి వైద్యం అందరి పాలిట వరం . తక్కువ ఖర్చుతో పొయ్యే హోమియో వైద్యం పేదల పాలిట పెన్నిది. ఆక్యు పంక్చర్, ఆక్యుప్రెషర్ ఏదీ తక్కువ కాదు. దేని విలువ దాని కుంది .కారణాలు ఏమైనా మనుషులుకు రోగాలు రావడం సహజం. మానవ శరీరాలు రోగాలకు అతీతాలు కావు . రోగాలు ఉత్పన్నమయినప్పుడు వాటి నివారణ కోసం మానవుడు చేసే ప్రయత్నాలెన్నో ఉన్నాయి. ఆ ప్రయత్నాల ఫలితంగానే దేశ దేశాల్లో ఎన్నో రకాలయిన వైద్య విధానాలు రూపుదిద్దుకున్నాయి. నాటు వైద్యం, ఆయుర్వేదం, యునాని, ప్రకృతి వైద్యం. ఆకుపంక్ఛర్, ఆక్యుప్రెషర్, అల్లోపతి, హొమియోపతి వాటిలో ఎక్కువగా అమలులో ఉండేవి .మనుషులకు రోగాలు రావడం అనివార్యం . వచ్చిన రోగాలను వస్తే వచ్చిందిలే అని చేతులు ముడుచుకొని చూస్తూ కూచోలేం. నివారణ కోసం ప్రయత్నిస్తాం. ఆప్రయత్న హలితంగా తరతరాల నుంచి ఎన్నో వైద్య విధానాలు రూపుదాల్చాయి వాటిని పరిచయం చెయ్యడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్ధేశం. ఇది చదివి ఎవరికి ఏదినచ్చిందో, ఏది అందుబాటులో ఉందో దాన్ని పాటించి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ - మహాసముద్రందేవకి